బ్రతకడానికే తినాలా? లేక తినడానికే బ్రతకాలా? అని ఆలోచిస్తే ఎలా ఐనా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు గల ఆహారం చాలా అవసరం. ఓట్స్ మంచి బలవర్ధకమైన ఆహారం.
మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, ఏంటీ ఆక్సిడెంట్స్ వుంటే గుండె జబ్బులు, కాన్సర్, చక్కెర వ్యాధి దరిచేరవు. తృణధాన్యాల వినియోగం కూడా రాను, రాను కొరవడుతుంది. అందుకే తృణధాన్యాల ఉపయగం తప్పనిసరిగా చెయాలి.అవి గోధుమ, ధాన్యం, చోళ్లు, జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్ ప్రధానమైనవి. ఓట్స్ లో విటమిన్ బి. పీచు పదార్ధం, ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.
కావలసిన వస్తువులు:
ఓట్స్ – 1/2 కప్పు
సేమ్యా – 1/2 కప్పు
నెయ్యి – ౩ tsp
చక్కెర - 3/4 కప్పు
యాలకుల పొడి - 1/2 tsp
జీడిపప్ప, బాదాం, కిస్మిస్ – 1/4 కప్పు
పాలు – 1/2 litre
ముందుగా ప్యాన్ లో చెంచాడు నెయ్యి వేడి చేసి ఓట్స్ ని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.. మళ్ళీ ఇంకో చెంచాడు నెయ్యి వేడి చేసి సేమ్యాని కూడ బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వే్యించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ ఇంకో చెంచాడు నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకొవాలి.
పాలు వేడి చేసి ముందుగా సేమ్యా వేసి ఉడికించాలి. సేమ్యా ఉడుకుతుండగా ఓట్స్ వేసి మరి కొద్ది సేపు ఉడికించాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి నిమిషం సేపు ఉడికించి వేయించిన పలుకులు కలపాలి. దింపేసి వేడిగా కాని, చల్లగా కాని సర్వ్ చేయాలి.
ఇందులో డయాబెటిస్ పేషంట్లు చక్కెర బదులు Artificial Sweetener లేదా తేనె వాడొచ్చు. సేమ్యా బదులు సగ్గుబియ్యం కూడా ఉపయోగించవచ్చు.



3:34 pm on March 15th, 2010 1
తినేది తప్పనిసరిగా ఆరోగ్యాన్ని ఇచ్చేది అయ్యి వుండాలి …